కుప్పకూలిన భవనం..10 మంది మృతి

SMTV Desk 2018-04-01 12:45:45  indore, hotel building kollapse,

ఇండోర్, ఏప్రిల్ 1‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. సర్వతే బస్టాండ్‌ సమీపంలో హోటల్‌ భవనం కూలి 10 మంది మృతి చెందారు. శిథిలాల్లో మరో 50మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. రాత్రి 9.17 గంటల సమయంలో వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు సర్వేట బస్టాండ్‌ సమీపంలోని హోటల్‌ భవనాన్ని ఢీకొందని, దీంతో భవనం కూలిందని భావిస్తున్నారు. హోటల్లో మొత్తం 25గదులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు సహా మొత్తం 10 మరణించినట్లు సమాచారం. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుపోయి ఉండొచ్చని నగర మేయర్‌ మాలిని గౌర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.