న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ కార్యదర్శిగా న్యాయవాది అయిన యశోమతి ఠాకూర్ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యమివ్వాలన్న రాహుల్ అభిలాష మేరకే ఆమెను కర్ణాటకకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమించినట్లు తెలిసింది. యశోమతి ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నారు.