తాజ్‌ సందర్శకులకు మూడు గంటలు మాత్రమే!

SMTV Desk 2018-03-31 19:00:46  Taj Mahal, visitvisitors, Time limit

ఆగ్రా, మార్చి 31: తాజ్‌ మహల్‌ సందర్శకులకు ఇక నుంచి కాల పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి తాజ్‌ మహల్‌ వద్ద కేవలం మూడు గంటలు మాత్రమే పర్యాటకులు గడిపేలా ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) పరిమితి విధించబోతోంది. ఈ మేరకు ఏఎస్‌ఐ ఓ నోటీసును జారీచేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటి వరకు సందర్శకులు సాయంత్రం ఆ ప్రేమ మందిరం మూసే వరకు అక్కడ గడిపే సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఆ నిబంధన తొలగించనున్నారు.