లక్నో, మార్చి 31: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్ధేశించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత శలభ్ మని త్రిపాఠి శుక్రవారం రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేశారు. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఐపీసీ సెక్షన్ 499, 500 (పరువు నష్టం) కింద ఆయన ఫిర్యాదు చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.