హైదరాబాద్, మార్చి 30 : విభిన్నమైన పాత్రలు చేస్తూ కథానాయకుడిగా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైనా.. ప్రతి నాయకుడి పాత్రలు అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇంతకి ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.! అదేనండీ ఆదిపినిశెట్టి. బలమైన ప్రతినాయకుడి పాత్రలలో నటిస్తూ.. విలన్ తరహా పాత్రలకు పూర్తి న్యాయం చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగాడు. దీంతో ఇక ఆదిపినిశెట్టికి తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా అలాంటి విలన్ పాత్రలే అధికంగా వచ్చాయట. ఆదితో సినిమా చేయడానికి వచ్చే దర్శకనిర్మాతల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్.. అతని సరసన నటించడానికి హీరోయిన్స్ సైతం ఎంతో ఆసక్తి చూపిస్తు౦డడం విశేషం. ఇదిలా ఉండగా ఇకపై ఆది.. విలన్ పాత్రలను ఆపేసి పూర్తి స్థాయి హీరోగా మాత్రమే నటించనున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.