బస్సులో అగ్నిప్రమాదం..20 మంది సజీవదహనం

SMTV Desk 2018-03-30 11:35:50  Bus, Blaze accident fire,Thailand, mayanmar

బ్యాంకాక్, మార్చి 30‌: థాయ్‌లాండ్‌ నుంచి రాజధాని బ్యాంకాక్‌ వైపు వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైంది. బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణీకులు సజీవదహనమయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, కొంత మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులంతా మయన్మార్‌ వలస కార్మికులే.. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ మాదకద్రవ్యాలు తీసుకుని బస్సును నడిపినట్లు పోలీసులు వెల్లడించారు.