హైదరాబాద్, మార్చి 29 : ఐపీఎల్-11 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 7 నుండి ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే జట్లు సాధన మొదలుపెట్టశాయి. కాగా ఓ ప్రముఖ ఛానెల్ ప్రసారం చేయనున్న ఐపీఎల్ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై యంగ్ టైగర్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఐపీఎల్ కోసం ఆయన ప్రోమో షూట్లో పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తారక్ పక్కన ప్రముఖ హాస్యనటుడు మధు (గుండెజారి గల్లంతయ్యిందే ఫేం) కూడా ఉన్నారు. గతంలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్బాస్’ తెలుగు సీజన్ 1 విశేషమైన ఆదరణ లభించిన విషయం తెలిసిందే. తారక్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నారు. తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.