హైదరాబాద్, మార్చి 27 : మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా "భరత్ అనే నేను" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా కైరా అద్వాని ఆనందంతో ఉప్పొంగిపోతోంది. తెలుగులో తొలి సినిమా స్టార్ డైరెక్టర్.. సూపర్ స్టార్ లతో చేయడం ఎంతో అదృష్టం అంటూ చెప్పుకొచ్చింది. దర్శకుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కృషి చేశానంది. తెలుగు రాకపోయినప్పటికి.. డైలాగ్ విషయంలో మహేష్ ఎంతో హెల్ప్ చేశాడని పేర్కొంది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని, ఈ పాత్ర అమ్మాయిలందరికి బాగా కనెక్ట్ అవుతుందని వెల్లడించింది.