తెలుగమ్మాయిలు కొత్తగా వచ్చి పీకేదేమి లేదు : శ్రీరెడ్డి

SMTV Desk 2018-03-27 17:21:57  Srireddy Actress, Jyothi Actress, Casting Couch In Tollywood.

హైదరాబాద్, మార్చి 27 : గత కొన్ని రోజులుగా ఏ టీవీ ఛానల్ చూసిన ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పదం వినబడుతుంది. ఈ అంశంను ఎంచుకొని తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నటి శ్రీరెడ్డి చాలా పాపులారిటీ తెచ్చుకుంది. చిత్ర సీమ పెద్దలపై.. ఇండస్ట్రీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడం గమనించిన న్యూస్ ఛానళ్లు.. ఆమెను లైవ్ లో కూర్చోబెట్టి షోలు నడిపించేస్తున్నాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డితో పాటు.. నటి జ్యోతిని కూడా లైవ్ లోకి ఆహ్వానించారు. శ్రీరెడ్డి చెబుతున్న కొన్ని విషయాలపై జ్యోతి వ్యతిరేకించగా.. శ్రీరెడ్డి ఆవేశానికి గురైంది. తనకు జరిగిన కొన్ని అనుభవాలను చూపించి.. పరిశ్రమ మొత్తం ఇలాగే ఉంటుందని ఎలా చెబుతున్నావు..? అని జ్యోతి ప్రశ్నించగా.. దానికి శ్రీరెడ్డి సరైనా జవాబు చెప్పలేకపోయింది. అయితే.. తనకు ఎదురైన సంఘటనల ఆధారంగానే ఓ మంచి కోసం పోరాటం చేస్తున్నానని అంటూనే.. ఇప్పుడప్పుడే తెలుగమ్మాయిలు కొత్తగా వచ్చి పీకేది ఏమీ లేదని.. కోట్లు కోట్లు సంపాదించలేరని శ్రీరెడ్డి అంటోంది. దీనికి రియాక్ట్ అయిన జ్యోతి.. కొత్త వాళ్లను రావద్దని చెప్పడం కరెక్ట్ కాదని.. అయినా ఇండస్ట్రీలోకి వచ్చే అందరూ డబ్బు కోసం రారని.. వారికి ఆన్ స్క్రీన్ పై కనిపించడం ఓ ప్యాషన్ అని వాదించింది జ్యోతి. కాగా.. శ్రీరెడ్డిని లుంగీ కట్టుకున్న ఓ వ్యక్తి ఇంటికి వచ్చాడని చెప్పావు. తరువాత ఏం జగిగింది అంటే.. చివరకు నాకిష్టం లేక పంపించా అంటావ్ అంతే కదా ఎద్దేవా చేసిన జ్యోతి.. ఏం జరగనప్పుడు నువ్వు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాలి.. ?? అని ప్రశ్నించింది. నువ్వు ఐదేళ్ళగా నిన్ను వాడుకుంటుంటే నువ్వు అప్పుడే వెల్లిపోవచ్చుగా.. అని జ్యోతి అనగా.. టీవీ యాంకార్ కూడా పదే పదే ఆ విషయాన్నే ప్రశ్నించినా శ్రీరెడ్డి స్పందిచక పోవడం గమనార్హం. ఇంతకీ ఈ శ్రీరెడ్డి వ్యాఖల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.