సమంతకు ఒక్క పైసా ఇవ్వలేదు : కేటీఆర్

SMTV Desk 2018-03-27 17:00:17  minister KTR, Hand-loom workers,Samantha.

హైదరాబాద్, మార్చి 27 : కేసీఆర్ పాలనలో తెలంగాణ చేనేతకు స్వర్ణయుగం వచ్చిందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తెలంగాణకు చెందిన కార్మికులు ఎంతో మంది ఉన్నారని, అనేక మంది వలసలు వెళ్ళారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఎందరో నాయకులు వచ్చి వెళ్ళారు కాని చేనేత కార్మికుల జీవితాలు మాత్రం మారలేదని వాపోయారు. ఈ మేరకు కేటీఆర్ శాసనమండలిలో చేనేత కార్మికులపై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రుణమాఫీకి పక్కాగా ప్లాన్ చేసి అమలు చేస్తునట్లు తెలిపారు. తమది చేనేతల చేతల సర్కారు అని... కేంద్రం నుంచి సహకారం లేకున్నప్పటికీ వెనకడుగు వేయలేదని వెల్లడించారు. హీరోయిన్ సమంత ఉచితంగానే చేనేత బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారని.. ఆమెకు ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు.