హైదరాబాద్, మార్చి 27 : మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నేడు తన 32 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్చరణ్ సతీమణి ఉపాసన.. విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తన భర్త మీద ఉన్న ప్రేమను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తూనే ఉంటుంది. అయితే నేడు చరణ్ పుట్టిన రోజు కావున.. "హ్యాపీ బర్త్డే మిస్టర్ సి" అని పూలతో నేలపై రాసి ఉండగా, దాని ముందు నీలం జీన్స్ ప్యాంట్, తెల్ల చొక్కా ధరించిన ఓ వ్యక్తి నిలబడ్డారు. కాని ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇలా విభిన్నంగా రామ్చరణ్కు ఉపాసన బర్త్డే విషెస్ తెలుపుతూ ఒక సింపుల్ ఫోటోను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇదిలా ఉండగా చరణ్ తల్లిదండ్రులు.. పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే "టైం లెస్ గిఫ్ట్" ను ఇచ్చి సర్ ప్రైస్ చేసిన విషయం తెలిసిందే. మరోపక్క చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్న వారిని చిరంజీవి అభినందించారు. "తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోను రక్తదానం చేయడం అభినందనీయం. రామ్చరణ్కు ఇంతకన్నా పెద్ద బహుమతి ఇంకేం ఉంటుంది.?" అన్నారు. ప్రస్తుతం రామ్చరణ్ కథానాయకుడిగా.. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న "రంగస్థలం" చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.