ముంబై, మార్చి 26 : దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.. "దఢక్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరాఠీలో బ్లాక్బస్టర్ సాధించిన "సైరాట్" కు రీమేక్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడిగా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖత్తర్ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ప్రస్తుతం కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ వద్ద చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు శశాంక్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఫోటోలను పంచుకున్నారు. కాగా ఈ చిత్రం జూన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీదేవి చనిపోయిన రెండు వారాల తర్వాత జాన్వీ షూటింగ్ లో పాల్గొంది. ఆమెకు తోడుగా తన చెల్లెలు ఖుషి సెట్స్ కి వెళ్తున్నట్లు తెలుస్తుంది.