వైఎస్ విజయమ్మగా శరణ్య..!

SMTV Desk 2018-03-26 15:21:15  ys rajashekar biopic, ys biopic cast and crew, director mahi v raghava,

హైదరాబాద్, మార్చి 26 : ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమ౦త్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో భారీ తారాగాణ౦ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది నటీ నటులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ పాత్ర కోసం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని ఫిక్స్ చేశారు. అలాగే అతని సతీమణి విజయమ్మ పాత్రకోసం దర్శకుడు చాలా మందికి ఆడిషన్ నిర్వహించారట. తొలుత ఆ పాత్రలో నయనతార నటిస్తుంది అనే వార్తలు వచ్చాయి. కాని ఆ విషయం అవాస్తవమంటూ చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. తాజాగా విజయమ్మ పాత్రలో సీనియర్ నటి శరణ్యను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆమె చూడడానికి అలాగే ఉంటుందని ఆమెను సెలెక్ట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వైఎస్ షర్మిల పాత్రకు కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.