ఇద్దరు జర్నలిస్ట్‌ల దారుణ హత్య

SMTV Desk 2018-03-26 12:03:48  Journalists, Bihar, Local leader,Dainik Bhaskar

పట్నా, మార్చి 26: బీహారులో జర్నలిస్ట్లులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక నాయకుడొకరు కారుతో ఢీకొట్టి ఇద్దరు జర్నలిస్ట్లులను హత్య చేశాడు. దైనిక్‌ భాస్కర్‌ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్‌ నిశ్చల్‌, విజయ్‌ సింగ్‌ అనే ఇద్దరు పాత్రికేయులు దారుణ హత్యకు గురైయ్యారు. పట్నాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోజ్‌పూర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్‌ హర్సు అనే స్థానిక నాయకుడు, తన కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవీన్‌, విజయ్‌లు బైకుపై ఆరా ప్రాంతానికి వెళుతుండగా వీరి వాహనాన్ని మహ్మద్‌ హర్సు అతడి కుమారుడు స్కార్ఫియోతో ఢీకొట్టించారు. నిందితులపై కేసు నమోదు చేశామని, వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.