మల్కన్గిరి, మార్చి 26: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని కొరాపుట్ జిల్లా నారాయణపట్నా ప్రాంతంలోఆదివారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు ఐజీ ఎస్ షైనీ తెలిపారు. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. సంఘటన స్థలం నుంచి కిట్ బ్యాగులు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు.