హైదరాబాద్, మార్చి 25 : ఇటీవలీ కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు పలు వివాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఒకటి పోతే మరొకటి అన్నటుగా గతకొన్నాల నుండి కొన్ని వివాదాలు సినీ పరిశ్రమను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. సినీ పరిశ్రమ గురించి.. అందులో ఉండే వ్యక్తుల గురించి కించపరుస్తూ మాట్లాడారంటూ.. ఓ ఛానల్ పనిచేస్తున్న యాంకర్ పై సినీ పరిశ్రమ కేసు పెట్టింది. ఓ చర్చ సందర్భంగా సినిమా పరిశ్రమలోని మహిళల గురించి అసభ్యకరంగా నోరు జారారంటూ ఫిర్యాదులో పేర్కొంది. సినిమావాళ్లను వేశ్యలతో పోల్చారని, తక్కువ చేసి మాట్లాడారని కేసు పెట్టారు. మా ప్రెసిడెంట్ శివాజీరాజా అధ్యక్షతన నటీనటులు పోలీసుల చేత క్రిమినల్ కేసు నమోదు చేయించారు.