శ్రీనగర్, మార్చి 24: జమ్ముకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలో శనివాం ఉదయం భద్రతాసిబ్బంది, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. అనంత్నాగ్లోని శిస్త్రాగమ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో గత రాత్రి నుంచి భద్రతాసిబ్బంది ఆ ప్రాంతంలో నిర్భంద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాసిబ్బందిపైకి కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.