చిక్కుల్లో టీమిండియా క్రికెటర్..

SMTV Desk 2018-03-22 12:29:28  Hardik Pandya, sc st atrocity case on pandya, dr br. ambedkar, jodhpur

హైదరాబాద్, మార్చి 22 : భారత్ క్రికెట్ జట్టు అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని జోధ్‌పూర్ కోర్టు పోలీసుల‌ను ఆదేశించింది. గత సంవత్సరం డిసెంబర్ 26 వ తేదిన పాండ్యా తన ట్విట్టర్ ఖాతాలో భారత రాజ్యాంగా నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాజ‌స్థాన్‌కు చెందిన రాష్ట్రీయ భీమ్ సేన స‌భ్యుడు మేఘావాల్, అతనిపై కోర్టులో పిటీష‌న్ దాఖలు చేశారు. పాండ్యాపై పోలీసులు కేసు నమోదు చేయడానికి ససేమిరా అనడంతో మేఘావాల్ కోర్టును ఆశ్ర‌యించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వేశారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 26వ తేదీన పాండ్యా త‌న ట్విట‌ర్ ఖాతాలో `ఏ అంబేద్క‌ర్‌..? దేశంలో రిజ‌ర్వేష‌న్ల పేరుతో ఓ వ్యాధిని వ్యాప్తి చెందించిన వారే..?` అని ట్వీట్ చేశాడు.