ముంబై, మార్చి 22 : ఐపీఎల్లో డీఆర్ఎస్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గత కొన్నిరోజులుగా జరుగుతున్నా చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఈ ఏడాది నుండి ప్రారంభమయ్యే ఐపీఎల్-11 నుండి నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ని వినియోగించనున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం వెల్లడించారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక జట్టుకు ఒకసారి సమీక్షను ఉపయోగించుకునే వీలుంది. కాగా వచ్చే నెల 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది.