హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఘననివాళి..

SMTV Desk 2018-03-21 16:50:26  High Court Judge, High Court Fumigation, For High Court Ex judge Dharma Rao passed away

హైదరాబాద్, మార్చి 21 : న్యాయస్థానానికి విశిష్ట సేవలందించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇ. ధర్మారావు అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఆయనకు నివాళి అర్పించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఫుల్ కోర్టు సమావేశమై జస్టిస్ ధర్మారావుకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రంగనాథన్ మాట్లాడుతూ న్యాయమూర్తిగా ఆయనందించిన సేవలను కొనియాడారు.