కరీంనగర్, మార్చి 21: పార్లమెంట్లో ఏపీ నాయకుల అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ సాకుగా చూపి అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. పక్కింట్లో పెళ్ళయితే మన ఇంట్లో సున్నం వేసుకుంటామా అన్నట్టుగా టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.