లోక్ సభ రేపటికి వాయిదా..

SMTV Desk 2018-03-21 15:08:33  Lokhsabha, postponed, speaker, sumithra mahajan

న్యూఢిల్లీ, మార్చి 21: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న తీరు ఏమాత్రం మారడం లేదు. లోక్ సభలో వాయిదాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్‌ సభ్యులు తమ సమస్యలపై నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను గురువారం నాటికి వాయిదా వేశారు.