హైదరాబాద్, మార్చి 21 : ఈ ఏడాది ఐపీఎల్-11సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మొత్తం ఎనిమిది టీంలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో రెండు సంవత్సరాల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగుతున్నాయి. కాగా ఈ ఐపీఎల్ సీజన్కుగాను సన్రైజర్స్ హైదరాబాద్ ‘గో గో గో గో హియర్ వి గో గో గో.. వియ్ ఆర్ ది ఆరెంజ్ ఆర్మీ’ అనే తమ స్లోగన్ను అధికారిక ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ స్లోగన్ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. వచ్చే నెల 7న మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ఆరంభ పోరులో చెన్నై సూపర్ కింగ్స్తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తలపడనుంది.