మా డిమాండ్లకోసమే ఆందోళన: ఎంపి వినోద్ కుమార్

SMTV Desk 2018-03-21 12:19:42  TRS, mp`s, demanding, reservation, quota,parliamenet, premises

న్యూఢిల్లీ, మార్చి 20: తమ డిమాండ్లకోసమే ఆందోళన చేపడుతున్నట్లు తెరాస ఎంపీ, లోక్‌సభ పార్టీ పక్షం ఉపనాయకుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. బీజేపీ సూచన మేరకే టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్నారంటూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలన్నది తమ డిమాండ్, ఈ లక్ష్య సాధనకోసమే తాము పార్లమెంటులో పోరాడుతున్నామని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.