న్యూఢిల్లీ, మార్చి 21 : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉన్న క్రికెట్ మెగా ఈవెంట్ ఐపీఎల్ను ఇక నుండి యప్ టీవీలో కూడా చూడవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 27 వరకూ జరిగే వీవో -ఐపీఎల్ 2018 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్టార్ ఇండియా ఈ మ్యాచ్లను ప్రసారం చేసే హక్కులను దక్కించుకొన్న విషయం తెలిసిందే. యూరప్, దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలు, ఆస్ట్రేలియాలలోని క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్లను యప్ టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని దాని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ డివైజ్ల ద్వారా యప్ టీవీ, వెబ్సైట్ ద్వారా మ్యాచ్లు చూడొచ్చు. వీవో ఐపీఎల్-2018 ప్రసారం చేసే ప్రత్యేక హక్కుల్ని పొందినందుకు చాలా ఆనందిస్తున్నామని యప్ టీవీ స్థాపకులు ఉదయ్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.