భువనేశ్వర్, మార్చి 20 : భారత వైమానిక దళానికి చెందిన ఒక విమానం కుప్పకూలింది. ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దులోని మయుభంజ్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలెట్ చాకచక్యంగా తప్పించుకొన్నాడు. శిక్షణలో భాగంగా పశ్చిమ్బంగాలోని కలైకుందా నుంచి బయల్దేరిన ఈ విమానం తిరిగి ఇదే బేస్కు రావాల్సి ఉండగా సాంకేతిక లోపంతో మార్గ మధ్యంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పైలట్ కు తీవ్ర గాయాలు కాగా.. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.