కోల్కతా, మార్చి 20 : ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకు ఫుల్ మజా ఇవ్వడానికి ఐపీఎల్-11 సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా అలరిస్తున్న ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఏప్రిల్ 7న నుండి మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) కూడా ప్రాక్టీస్ సెషన్స్ను ఆరంభించేసింది. జాధవ్పూర్ యూనివర్సిటీలోని స్టేడియంలో ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్నారు. సోమవారం మొదలుపెట్టిన వార్మప్ సెషన్స్లో వైస్ కెప్టెన్ రాబిన్ ఉతప్ప సహా 11 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు శుభ్మన్ గిల్, నాగర్కోటి, వినయ్ కుమార్, ఇషాంక్ జగ్గీ తదిదరులు ఉన్నారు. గౌతమ్ గంభీర్ సొంత జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేయడంతో ఆ స్థానంలో దినేశ్ కార్తీక్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. త్వరలో కార్తీక్ కూడా ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటాడని ఫ్రాంఛైజీ నిర్వాహకులు వెల్లడించారు.