చెన్నై, మార్చి 20 : అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార జైల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న వీకే శశికళకు పెరోల్ మంజురైంది. శశికళ భర్త నటరాజన్ నిన్న రాత్రి చెన్నై ఆసుపత్రిలో మరణించగా.. ఆమెకు పెరోల్ ఇవ్వాలని న్యాయస్థానానికి దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి పెరోల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఆమెకు ఎన్ని రోజుల పెరోల్ మంజూరయిందన్న విషయంపై స్పష్టత రాలేదు. సాయంత్రం 4 గంటలకు ఆమె జైలు నుంచి బయటకు వస్తుందని, ఆపై నేరుగా చెన్నై చేరుకుంటారని, రేపు తంజావూరులో జరిగే భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొంటారని శశికళ తరఫు న్యాయవాదులు తెలిపారు.