అమరావతి, మార్చి 19 : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు ఈ సాయంత్రం విడుదలయ్యాయి. టెట్ ఫలితాలను విజయవాడలోని గేట్ వే హోటల్లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. గతంలో విడుదల చేసిన ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలు వెలువడగా.. పలు ప్రశ్నలకు మార్కులను కలుపుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితాల కోసం cse.ap.gov.in లేదా aptet.apcfss.in లలో సంప్రదించండి.