రాంచీ, మార్చి 19: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. దాణా స్కామ్కు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. సోమవారం రాంచీ(జార్ఖండ్) సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్ నేత జగన్నాథ మిశ్రాను మాత్రం కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన లాలూ అటు నుంచే అటే ఉదయం కోర్టుకు వెళ్లారు. డుంక ఖజానా నుంచి డిసెంబర్ 1994-జనవరి 1996 మధ్య రూ. 3 కోట్ల 13 లక్షల రూపాయలు అక్రమంగా విత్ డ్రా చేసిన సంఘటనకు సంబంధించినదీ కేసు. ఈ కేసులో మొత్తం 30 మంది నిందితులు విచారణ ఎదుర్కొన్నారు. శిక్షలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.