లోక్‌సభ రేపటికి వాయిదా..

SMTV Desk 2018-03-19 14:36:58  lokhsabha, postponed, tuesday, speaker sumitra mahajan

న్యూఢిల్లీ, మార్చి19: ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై తెదేపా, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై సోమవారం కూడా లోక్‌సభలో చర్చ జరగలేదు. సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వేశారు. తొలుత ఆమె తెదేపా, వైకాపా సభ్యల అవిశ్వాస తీర్మానాలను స్వీకరించారు. సభ్యులు సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలంటూ కోరారు. కానీ, కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో సభ్యుల నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదంటూ లోక్‌సభను స్పీకర్‌ మంగళవారానికి వాయిదా వేశారు.