నెలకు రూ. 8 లక్షలు చెల్లించనున్న నటుడు పృద్వీరాజ్

SMTV Desk 2017-06-29 16:17:17  film, actor, prudhvi raj

విజయవాడ, జూన్ 29 : ప్రముఖ సినీ హాస్య నటుడు పృధ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు తన భార్య అయిన శ్రీలక్ష్మి కి నెలకు రూ.8 లక్షలు భరణంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోని పిటిషన్ ప్రకారం... బాలిరెడ్డి పృధ్వీరాజ్ అలియాస్ శేషు అలియాస్ మూర్తి విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి ని 1984 లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు విజయవాడలో ఒక మిఠాయి దుకాణాన్ని నిర్వహిస్తూ ఉండేవారు. క్రమంగా శ్రీలక్ష్మి తండ్రి కన్నుమూసారు. ఆ తరువాత వీరి ఇరువురు ఆ మిఠాయి దుకాణాన్ని నిర్వహించేవారు. నటనపై ఆసక్తి ఉన్న పృథ్వి అప్పుడప్పుడు చెన్నై వెళ్లి వస్తుండేవాడు. అలా వెళ్లి రావడంతో సినీరంగంలో రాణించారు. దీనితో వీరు కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు. 2016 ఏప్రిల్ 05 న వ్యసనాలకు బానిసైన పృథ్వి తన భార్యతో గొడవపడి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. ఆ సంఘటనతో ఆమె విజయవాడ చేరుకుంది. శ్రీలక్ష్మి కి తెలిసిన పెద్దమనుషులు వీరి ఇరువురిని కపడానికి ప్రయత్నించిన పృథ్వి పట్టించుకోలేదు. అందువలన 2016 నవంబర్ 02న సుర్యరాపేట పోలీస్ స్టేషన్ లో ఆమె పృథ్విరాజ్ పై 498ఎ కేసు పెట్టింది. తనకి నెలకు రూ. 10లక్షలు ఇప్పించాలని తన భర్త యొక్క ఆదాయ పరిస్థితి బాగానే ఉంది అని ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది శ్రీలక్ష్మి.... పృధ్విరాజ్ ఇది పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ లో పేపర్ ప్రకటన ద్వారా నోటీసు జారీ చేశారు. అలా అయినప్పటికీ కేసు వాయిదాకు హాజరుకాలేదు. అందువలన న్యాయమూర్తి భాదితురాలికి నెలకు రూ. 8లక్షలు భరణం ఇవ్వాలని పృధ్వీరాజ్ కు ఉత్తర్వు జారీ చేశారు.