రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు దుర్మరణం

SMTV Desk 2018-03-18 12:04:29   Road Accident, in Delhi, Three doctors killed

న్యూఢిల్లీ, మార్చి 18 : మధుర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఎయిమ్స్ వైద్యులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్తుండగా ఒక కంటైనర్‌లోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ యష్‌పాల్, డాక్టర్ హర్షద్, డాక్టర్ హేంబాల అక్కడికక్కడే మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.