కాలిఫోర్నియా, మార్చి 17 : ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ (రొమేనియా)కు అన్ సీడెడ్ క్రీడాకారిణి షాకిచ్చింది. శుక్రవారం రాత్రి టోర్నీలో భాగంగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్లో హలెప్ 3-6, 0-6 తేడాతో జపాన్కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలైంది. దీంతో టోర్నీనుండి హలెప్ వైదొలగగా, ఒసాకా ఫైనల్కు చేరింది. ఆదివారం జరిగే చివరిపోరులో రష్యాకు చెందిన దారియా కసాత్కినాతో ఒసాకా తలపడనుంది.