తమ్ముడిని కాపాడబోయి.. నలుగురు మృత్యువాత..

SMTV Desk 2018-03-17 16:12:06  vishakhapatnam crime, 4 members died, septic tank.

విశాఖ, మార్చి 17 : విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంతలో నీటిని తొడుతుండగా ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు దాంట్లో పడిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించడానికి మరో నలుగురు వ్యక్తులు ట్యాంకులోకి దిగారు. కాని దురదృష్టవశాత్తూ.. ఊపిరాడక నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బాధితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.. స్వయానా అన్నదమ్ములే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.