ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది.? : కేటీఆర్

SMTV Desk 2018-03-17 14:56:01  ts it minister, ktr, Sand mafia, congress, ktr twitter.

హైదరాబాద్, మార్చి 17 : గడిచిన ఈ పదేళ్ల కాలంతో పోలిస్తే కాంగ్రెస్ హయంలో కాకుండా తెరాసా హయంలోనే ఇసుక ద్వారా రాష్ట్ర ఖజానాకు వంద రేట్ల ఆదాయం పెరిగిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2004-14 మధ్య కాలంలో పోలిస్తే.. ఇసుక విక్రయం ద్వారా తెలంగాణకు వచ్చిన ఆదాయం రూ.39 కోట్లకు పైగా ఉందని తెలిపారు. 2014 నుంచి 2018 వరకు కేవలం నాలుగేళ్లలో ఆదాయం ఏకంగా 1609 కోట్ల రూపాయలకు చేరుకొందని... సగటున ఏడాదికి రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వివరించారు. పెరుగుదలలో 100 శాతం వృద్ది సాధించామన్న కేటీఆర్.. గతంలో ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో తెలియట్లేదని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వాస్తవాలన్ని ఇలా ఉండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇసుక మాఫియాను అరికట్టాలంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.