న్యూఢిల్లీ, మార్చి 16 : ఇటీవల జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు ఎంపీలు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయనడానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని భావిస్తున్న నేపథ్యంలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం ప్రాధాన్యం సంతరించుకుంది.తొలుత ఆర్జేడీ నుంచి గెలుపొందిన సర్ఫ్రాజ్ ఆలం ఎంపీగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక గోరఖ్పూర్, ఫూల్పూర్ల నుంచి విజయం సాధించిన సమాజ్వాదీ అభ్యర్థులు ప్రవీణ్కుమార్ నిషాద్, నాగేంద్ర పటేల్ సింగ్ పాటిల్ లు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ, ఏఐసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.