హైదరాబాద్, మార్చి 16 : తెలుగు, తమిళ, మలయాళంలో నిత్యామీనన్ కు చాలా అభిమానులు ఉన్నారు. ఇటివలి కాలంలో సాయి పల్లవి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఇద్దరిని ఒకే సినిమాలో చూస్తే అభిమానులకి కన్నుల పండుగే. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఓ తమిళ చిత్రం కోసం నిత్యామీనన్ ను.. సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు తెలిసింది. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.