న్యూఢిల్లీ, మార్చి 16: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్షుడు భగవ౦త్ మాన్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాకు అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడంతో భగవత్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. బిక్రమ్ సింగ్కు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడం భగవత్కు మింగుడు పడలేదు. దీంతో ఆప్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆప్కు మాత్రమే రాజీనామా చేశాను. కానీ డ్రగ్స్ మాఫియాతో పాటు అవినీతిపై నిరంతరం పోరాడుతానని భగవత్ స్పష్టం చేశారు.