48 గంటల్లో స్పందించకపోతే బంద్ కు పిలుపు : పవన్

SMTV Desk 2018-03-16 14:30:31  janasena, pawankalyan, diarrhea patients in guntur,

అమరావతి, మార్చి 16 : జనసేన అధినేత పవన్.. రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. గుంటూరులో జరిగిన డయేరియా మరణాలపై రాష్ట్రం 48 గంటల్లో స్పందించకపోతే బంద్‌కు పిలుపునిస్తానని ప్రకటించారు. పవన్.. డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డయేరియాతో బాధపడుతున్న వారి పట్ల ప్రభుత్వం.. తక్షణమే స్పందించి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. ఈ పరిస్థితికి కారణమెవరు.? ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ.? రాష్ట్రంలో కనీసం తాగు నీరు ఇచ్చే పరిస్థితి లేదా.? ఇక్కడి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు పట్టించుకోరా.? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు.