రసవత్తర పోరుకు రె ‘ఢీ’

SMTV Desk 2018-03-16 11:14:58  srilanka vs india, nadahas trophy, srilanka, shakib al hasan

కొలంబో, మార్చి 16 : శ్రీలంక వేదికగా జరుగుతున్నా నిదహాస్ ట్రోఫీలో ఫైనల్ బెర్త్ కోసం రసవత్తర పోరుకు లంక, బంగ్లాదేశ్ జట్లు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్ ల విజయాలతో ఇప్పటికే భారత్ ఫైనల్ కు చేరగా, మిగతా రెండు జట్లు ఒక్కో గెలుపుతో ఉండగా ఈ మ్యాచ్ ‘సెమీ ఫైనల్‌’ ను తలపిస్తుంది. మొదటి మ్యాచ్ లో టీమిండియా కు షాకిచ్చిన లంక జట్టు అదే హవాను కొనసాగించలేకపోయింది. కెప్టెన్ చండీమల్ దూరంకావడంతో జట్టుకు తిసార పెరీరా నాయకత్వం వహిస్తున్నాడు. ముఖ్యంగా బంగ్లాతో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు సాధించినా బంగ్లా చేతిలో లంకేయులు కంగుతిన్నారు. ఈ సారి ఆ లోపాలను సరిదిద్దుకొని మ్యాచ్ నెగ్గాలని లంక భావిస్తుంది. మరోవైపు టీమిండియా జట్టుతో కడవరకూ పోరాడి ఓడిపోయినా బంగ్లా జట్టులో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. అంతేకాకుండా ఆల్ రౌండర్, సారథి షకీబల్‌ హసన్‌ జట్టులోకి రావడంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఒక వేళా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న లంక జట్టు ఫైనల్ కు చేరుతుంది.