న్యూఢిల్లీ, మార్చి 16: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఏడుగురు కేంద్రమంత్రులు ఎన్నికయ్యారు. వీరిలో రవిశంకర్ ప్రసాద్ (బిహార్), ప్రకాశ్ జావడేకర్ (మహారాష్ట్ర), ధర్మేంద్ర ప్రధాన్, థావర్చంద్ గహ్లోత్ (వీరిద్దరూ మధ్యప్రదేశ్ నుంచి), జె.పి.నడ్డా (హిమాచల్ప్రదేశ్), పురుషోత్తం రూపాలా, మన్సుక్ మాండవీయా (ఇద్దరూ గుజరాత్ నుంచి) ఉన్నారు. అరుణ్జైట్లీ బరిలో నిల్చొన్న ఉత్తర్ప్రదేశ్తో పాటు పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 25న ఎన్నికలు నిర్వహించనున్నారు.