హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

SMTV Desk 2018-03-15 19:10:03  congress mlas, suspension, komati reddy venkat reddy, telangana assembly.

హైదరాబాద్, మార్చి 15 : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌ లు.. తమ శాసనసభ్యుల సభ్యత్వాలు రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో తమ సభ్యత్వాలు రద్దు చేసే ప్రక్రియలో స్పీకర్ రాజ్యంగా విరుద్దంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ముందుగా మాకు ఎలాంటి నోటీసులు పంపడం గాని, అసెంబ్లీ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం గాని చేయలేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని హెచ్చరించారు. తీర్పు వచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన గెజిట్‌పై ఒక నిర్ణయానికి రావద్దని ఈసీకి విజ్ఞప్తి చేశారు.