బీజేపీ నేతపై ఉగ్రవాద దాడి..గన్ మెన్ కు గాయాలు...

SMTV Desk 2018-03-15 17:07:54  kashmir, attack, bjp, leader

శ్రీనగర్‌, మార్చి 15: జమ్మూ-కశ్మీరులోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కల్లోల ప్రాంతం కాశ్మీర్‌లో గురువారం బీజేపీ నాయకుడు అన్వర్‌ ఖాన్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. అయితే అదృష్టవశాత్తు దాడి నుంచి ఆయన తప్పించుకోగలిగారు. అన్వర్‌ ఖాన్‌ వ్యక్తిగత అంగరక్షకుడు బిలాల్‌ అహ్మద్‌కు మాత్రం గాయలైయ్యాయి. బాల్‌హమా ప్రాంతంలో మిలిటెంట్లు ఒక్క సారిగా అన్వర్‌ ఖాన్‌పై కాల్పులు జరిపారు. గాయపడిన కానిస్టేబుల్‌ బిలాల్ అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించినట్లు, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.