హైదరాబాద్, మార్చి 15 : 2018-2019 వ సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాష్ట్రానికి ఉన్న అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ది, సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించిన ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.