న్యూఢిల్లీ, మార్చి 15: భాజపాపై ప్రజలు, అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. ఉత్తర్ప్రదేశ్లో ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గోరఖ్పూర్, ఫూల్ఫుర్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ యూపీలో కాంగ్రెస్ను పునర్నిర్మిస్తామని,ఇది ఒక్కరోజుతోనే అయ్యేపని కాదన్నారు. భాజా పై ప్రజలు అసంతృప్తి తో ఉన్నారని, అందుకే భాజపాయేతర అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించారన్నారు. .