హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ ప్రభుత్వం నేటి ఉభయసభల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్.. ఉదయం 11 గంటలకు ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బడ్జెట్ ప్రసంగంతోనే సభను ప్రారంభించనున్నారు. గతంలో మాదిరిగానే సంక్షేమ, నీటి పారుదలకు పెద్దపీట వేయడంతో పాటు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకానికి భారీగా నిధులను కేటాయించనున్నారు. గతేడాది 1,49,446కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ది సాధించడంతో అందుకు అనుకూలంగా 2018-2019 బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. శాసనసభలో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్.. శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఐదవసారి.