హైదరాబాద్, మార్చి 13 : ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హాల్టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా వారి సౌకర్యార్థం అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సమయానికి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి చేరవేసేందుకు ఉదయం నుండే బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు హాల్ టికెట్లు అందజేశామని, హాల్టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు సూచించారు.