రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్..

SMTV Desk 2018-03-11 17:47:08  TRS, KCR, Rajya Sabha seats, jaoginapalli santhosh

హైదరాబాద్, మార్చి 11 : రాజ్యసభ సమరంకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్ధులకుగానూ జోగినపల్లి సంతోష్, నల్గొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్ ముదిరాజ్ కు అవకాశం కల్పించారు. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణభవన్‌లో జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో నేతలతో చర్చించి వీరి పేర్లను కేసీఆర్‌ వెల్లడించారు. రేపు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు.