న్యూఢిల్లీ, మార్చి 11 : కేంద్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి సురేశ్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతల్ని అప్పగించింది. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని సురేశ్ ప్రభుకు అప్పగించాలని ప్రధాని నిర్ణయించారు. పీఎంవో సూచన మేరకు రాష్ట్రపతి కార్యాలయం శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఏపీ రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ టీడీపీ అధిష్ఠానం ఆదేశం మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవికి అశోక్గజపతిరాజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.